నీళ్లతో అందమైన ఆరోగ్యం
మనలో చాలా మందికి నీటివిలువ, మన ఆరోగ్యంపై నీటి ప్రభావం ఎంత అనేది తెలియదు. కాబట్టి దప్పికైతే తప్ప నీరు తాగరు. నీరు మన ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలుసుకుందాం.
మనశరీరంలో 60-70 శాతం ఉన్నది నీరే. మెదడు, కండరాలు, ఊపిరితిత్తులు, రక్తంలో ప్రధానభాగం నీరే. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రణ చేసేది నీరే. మన శరీరంలోని అన్ని భాగాలకూ న్యూట్రియట్స్ను పంపేది నీరే. శరీరంలోని మలినాలను తొలగించేది, జీర్ణక్రియకు తోడ్పడేది, రక్తం, మూత్రం తయారీల్లో ప్రముఖపాత్ర వహిస్తోంది నీరు. శరీరంలో నీటిశాతం తగ్గితే, డీ హైడ్రేషన్ రకరకాల తలనొప్పులు, కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు ప్రారంభం అవుతాయి. సరైన మంచినీరు శరీరానికి మీరు అందించకపోతే, మలబద్దకం ఏర్పడి అనేక రుగ్మతలకు దారితీస్తుంది.
- ప్రతి మనిషీ రోజుకు 5,6 లీటర్ల నీరు తాగాలి.
- మంచి నీరు సమయానికి అందకపోతే డీహైడ్రేషన్కు గురై అదే సమయంలో మెటడాలిజం రేటు మూడు శాతం తగ్గిపోతుంది.
- మంచినీరు శరీరానికి అందకపోతే శరీరం నీరసించిపోతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. ఏ పనిచేయలేరు. కళ్లుబైర్లు కమ్ముతాయి.
- ప్రతిరోజూ విధిగా 8,10 గ్లాసులు నీరు తక్కువ కాకుండా తాగేవారికి బ్లాడర్ కేన్సర్ సంభవించే అవకాశం తక్కువ.
- శరీరానికి నీటి శాతం తగ్గితే శరీర కాంతి కోల్పోతుంది. ముడతలు పడుతుంది. చర్మం వదులుగా అయిపోతుంది.
- కాఫీ తాగే అలవాటున్న వారు అదనంగా రెండు కప్పుల నీరు తాగాలి. కారణం కాఫీలోని కెఫైన్ కారణంగా మూత్రం అధికంగా వచ్చి శరీరం డీహైడ్రేషన్కు దారితీసే అవకాశం ఉంది. ఓ రకమైన తలనొప్పి కూడా వస్తుంది.
- మీ గుండె ఆరోగ్యంగా పనిచేయాలన్నా తప్పక పదిగ్లాసుల నీరు తాగాల్సిందే. అశ్రద్ధ చేయకండి.
- ఆహారం తిన్న రెండు గంటల అనంతరం నీరు తాగాలి.
- ఆహారంతో పాటు, ముద్ద ముద్దకూ నీరు తాగడం మంచి పద్ధతి కాదు.
గోళ్లు, జుట్టు, శరీరం అన్ని భాగాలూ ఆరోగ్యంగా ఉండాలంటే తగినన్ని మంచినీరు తాగాల్సిందే.
కిడ్నీలో రాళ్ళతో బాధపడేవారు ఎంత ఎక్కువగా నీరు తాగితే అంత మంచిది.
- మంచినీటిని పరిశుభ్రంగా ఉన్న ప్రదేశం నుండి వడకట్టి తాగడం మంచి పద్ధతి.
ఎక్కడ పడితే అక్కడ నీరును తాగకూడదు. ఆహారం వండటానికి, స్నానానికి పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలని గుర్తుపెట్టుకోండి.
మనశరీరంలో 60-70 శాతం ఉన్నది నీరే. మెదడు, కండరాలు, ఊపిరితిత్తులు, రక్తంలో ప్రధానభాగం నీరే. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రణ చేసేది నీరే. మన శరీరంలోని అన్ని భాగాలకూ న్యూట్రియట్స్ను పంపేది నీరే. శరీరంలోని మలినాలను తొలగించేది, జీర్ణక్రియకు తోడ్పడేది, రక్తం, మూత్రం తయారీల్లో ప్రముఖపాత్ర వహిస్తోంది నీరు. శరీరంలో నీటిశాతం తగ్గితే, డీ హైడ్రేషన్ రకరకాల తలనొప్పులు, కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు ప్రారంభం అవుతాయి. సరైన మంచినీరు శరీరానికి మీరు అందించకపోతే, మలబద్దకం ఏర్పడి అనేక రుగ్మతలకు దారితీస్తుంది.
- ప్రతి మనిషీ రోజుకు 5,6 లీటర్ల నీరు తాగాలి.
- మంచి నీరు సమయానికి అందకపోతే డీహైడ్రేషన్కు గురై అదే సమయంలో మెటడాలిజం రేటు మూడు శాతం తగ్గిపోతుంది.
- మంచినీరు శరీరానికి అందకపోతే శరీరం నీరసించిపోతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. ఏ పనిచేయలేరు. కళ్లుబైర్లు కమ్ముతాయి.
- ప్రతిరోజూ విధిగా 8,10 గ్లాసులు నీరు తక్కువ కాకుండా తాగేవారికి బ్లాడర్ కేన్సర్ సంభవించే అవకాశం తక్కువ.
- శరీరానికి నీటి శాతం తగ్గితే శరీర కాంతి కోల్పోతుంది. ముడతలు పడుతుంది. చర్మం వదులుగా అయిపోతుంది.
- కాఫీ తాగే అలవాటున్న వారు అదనంగా రెండు కప్పుల నీరు తాగాలి. కారణం కాఫీలోని కెఫైన్ కారణంగా మూత్రం అధికంగా వచ్చి శరీరం డీహైడ్రేషన్కు దారితీసే అవకాశం ఉంది. ఓ రకమైన తలనొప్పి కూడా వస్తుంది.
- మీ గుండె ఆరోగ్యంగా పనిచేయాలన్నా తప్పక పదిగ్లాసుల నీరు తాగాల్సిందే. అశ్రద్ధ చేయకండి.
- ఆహారం తిన్న రెండు గంటల అనంతరం నీరు తాగాలి.
- ఆహారంతో పాటు, ముద్ద ముద్దకూ నీరు తాగడం మంచి పద్ధతి కాదు.
గోళ్లు, జుట్టు, శరీరం అన్ని భాగాలూ ఆరోగ్యంగా ఉండాలంటే తగినన్ని మంచినీరు తాగాల్సిందే.
కిడ్నీలో రాళ్ళతో బాధపడేవారు ఎంత ఎక్కువగా నీరు తాగితే అంత మంచిది.
- మంచినీటిని పరిశుభ్రంగా ఉన్న ప్రదేశం నుండి వడకట్టి తాగడం మంచి పద్ధతి.
ఎక్కడ పడితే అక్కడ నీరును తాగకూడదు. ఆహారం వండటానికి, స్నానానికి పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలని గుర్తుపెట్టుకోండి.
No comments:
Post a Comment