వ్యవసాయం లో తెలంగాణా రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలుస్తుంది: పార్లమెంటరీ సెక్రెటరీ కోవా లక్ష్మి
రెబ్బెన : మార్చి 15(వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల గోలేటి లో గల "మన్నేపల్లి చెరువు" ను మిషన్ కాకతీయలో బాగంగా పనులను ఆదివారం పార్లమెంట్ సెక్రెటరి కోవా లక్ష్మి ప్రారంబిచారు ఈ చెరువు వలన సుమారు 130 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది దీనికోసం రూ. 39.40 లక్షల నిధులు మంజూరు అయినట్టు ఆమె తెలిపారు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపడుతూన్న మిషన్ కాకతీయ పథకం వలన తెలంగాణా రాష్ట్రం వ్యవసయంగా దేశం లో అగ్రగామిగా, పయనిస్తూ పేదరికం లో మగ్గుతున్న రైతులకు జీవనొపాది కలిగించడమే దీని ముఖ్యోదేసం అని ఆమె తెలిపారు, కోవా లక్ష్మి వెంట ఆదిలాబాద్ తూర్పు జిల్లా టి.అర్.ఎస్. అద్యక్షులు పురాణం సతీష్, జెడ్.పి.టి. సి. అజ్మీర బాబురావు ఏం.పి.పి. సంజీవ్ కుమార్ గోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్ తోపాటు మండలం లోని ఇతర సర్పంచులు మరియు ఎం.పి.టి.సి,లు కూడా పాల్గొన్నారు.
No comments:
Post a Comment