కేంద్రం ప్రకటించిన 24 గంటల విద్యుత్ సరఫరా పథకంలో ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసినట్లు మంత్రి పల్లెరఘునాథరెడ్డి తెలిపారు. అలాగే ఈ ఏడాది కేంద్రం ఏపీకి 2 వేల మెగావాట్ల విద్యత్ ను ఇవ్వనుందని చెప్పారు. ఇవాళ జరిగిన ఏపీ మంత్రి వర్గ సమావేశంలో రుణమాఫీతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. విజన్ 2020ను సవరించి విజన్ 2029గా మార్చే అంశంపై సమాలోచనలు జరిపారు. బోధనా రుసుం, ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ అంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు లేఖ రాయనున్నారు. అలాగే ఎయిడెడ్ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయస్సును 60కి పెంచే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది
No comments:
Post a Comment