Thursday, July 3, 2014

మహేష్ ను. ‘క్రిష్ణమ్మ పిలిచింది’ .....



కెరీర్ లో ఇప్పటి వరకు గెస్ట్ రోల్ లో కనిపించలేదు సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ త్వరలోనే ఫ్యాన్స్ కు ఆ ముచ్చట తీర్చనున్నాడు. గెస్ట్ రోల్ లో నటించాల్సిందిగా మహేష్ ను ‘క్రిష్ణమ్మ పలిచింది’. అర్థం కాలేదా.. మహేష్ బావ సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఈ సినిమాలో బావ కోసం ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడంట మన ప్రిన్స్. మహేష్ కోసం ప్రత్యేకంగా మంచి సీన్ క్రియేట్ చేశారట. ప్రస్తుతం ‘ఆగడు’ మూవీ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్న మహేష్.. షూటింగ్ పూర్తయిన వెంటనే సుధీర్ బాబు సినిమాలో చేరనున్నాడట.
ఇప్పటి వరకైతే మహేష్ కేమియో రోల్ లో నటించలేదు. కాకపోతే జల్సా, బాద్షా సినిమాలకు వాయిస్ ఓవర్ అందించాడు. అనుష్క నటిస్తున్న రుద్రమాదేవి లో గెస్ట్ రోల్ చేస్తాడని వార్తలొచ్చినా.. అది కుదరలేదు. తాజాగా సుధీర్ బాబు సినిమాలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ కు పండగే. ఇక సుధీర్ బాబు సినిమాను కన్నడ డైరెక్టర్ చంద్రు తెరకెక్కిస్తున్నాడు. కన్నడంలో చార్మినార్ పేరుతో వచ్చిన ఈ సినిమాకు కూడా చంద్రే డైరెక్టర్. ఇక ఈ సినిమాలో సుధీర్ కు జోడిగా నందిత నటిస్తోంది. గిరిబాబు, ఎమ్.ఎస్.నారాయణ.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments:

Post a Comment